Showing posts with label Kcr. Show all posts
Showing posts with label Kcr. Show all posts

Tuesday, 29 December 2015

4 స్థానాల్లో తెరాస, 2 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం.

  • స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస హవా కొనసాగుతోంది. 
  • నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ పట్టు నిరూపించుకుంది.


నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే విజయం సాధించారు.మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డి చెరో స్థానం కైవసం చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి , శంభీపూర్‌ రాజు లు గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

Monday, 28 December 2015

వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులు..

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో అయుత చండీ మహాయాగాన్ని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన కేసీఆర్, వేద పండితుల సూచన మేరకు ఇవాళ రాజన్నను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అయుత మహాచండీయాగం అనంతరం వేములవాడకు బయల్దేరి వెళ్లిన కేసీఆర్‌ దంపతులు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి ఈటల రాజేందర్‌ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

Saturday, 26 December 2015

అయుత చండీయాగంలో ఈరోజు...




    అయుత చండీయాగం ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరింది.  ఉదయం గురుప్రార్థన, గణపతిపూజతో ప్రారంభమవుతుంది.ఇవాళ కుండసంస్కారం, ప్రధానకుండంలో అగ్నిప్రతిష్ఠ నిర్వహిస్తారు. అలాగే అగ్ని విహారణం, స్థాపిత దేవతాహవనం, సపరివార అయుత చండీయాగం నిర్వహిస్తారు. అలాగే చండీయాగంలో పాల్గొన్నరుత్విక్కులకు సన్మానం జరగనుంది. అలాగే పూర్ణాహుతితో అయుత చండీయాగం ముగియనుంది. కాగా... నేడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తదితరులు చండీయాగానికి విచ్చేయనున్నారు. ఐతే ఎర్రవల్లికి తెల్లవారుజాము నుంచే  భక్తులు  బారిగా తరిలీ వస్తున్నారు. అయుత చండీయాగం ఈ రోజుతో ముగియనుంది.Watch

Wednesday, 23 December 2015